Suryaa.co.in

Telangana

కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ కాదు.. చార్లెస్ బాబ్బెజ్

– 1955 లో టాటా గ్రూప్ వాళ్లు కంప్యూటర్ పరిచయం చేశారు.
– ముఖ్యమంత్రి తెలివి అట్ల ఉంది
– డైలాగులు కొట్టుడు కాదు.. చేతనైతే రైతు భరోసా ఇవ్వు
– పోలీస్ బండ్లలో బిల్లులు కట్టలేదంటూ పెట్రోల్ పోస్తలేరు
– పల్లెల్లో పిచికారి కి కూడా పైసల్లేవ్
-స్కూళ్లలో చాక్ పీస్ లు లేని పరిస్థితి
– జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: చరిత్ర తెలియని కొంతమంది సెప్టెంబర్ 17 ను రాజకీయాల కోసం వక్రీకరించారు.తెలంగాణ లో గంగా జమున తెహజీబ్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గత పదేళ్లలో ఒక్క నొక్కు పడకుండా శాంతి భద్రతలను కాపాడారు.

నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన పనికి మాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. నోరు ఉంది కదా అని కేసీఆర్ ని దూషించటమే పనిగా పెట్టుకొని 9 నెలలు టైమ్ పాస్ చేశారు. చేతనైతే మీరు ఇచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేసి చూపెట్టండి.

చేతనైతే మా మాదిరిగా కరెంట్, రైతుబంధు ఇవ్వండి.కేసీఆర్ పది వేలే ఇస్తా అన్నాడు. నేను 15 వేలు ఇస్తా అని డైలాగులు కొట్టుడు కాదు. ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది. చేతనైతే రైతు భరోసా ఇవ్వు. చేతనైతే మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చు. చైతనైతే అవ్వ, తాతలకు ఇస్తానన్న 4 వేల ఫించన్లు ఇవ్వు.

చేతనైతే నిరుద్యోగులకు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడులో హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాశారు. చేతనైతే హైదరాబాద్ లో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. పోలీస్ బండ్లలో బిల్లులు కట్టలేదంటూ పెట్రోల్ పోస్తలేరు. స్కూళ్లలో చాక్ పీస్ లు లేని పరిస్థితి. మాజీ సర్పంచ్ లు బిల్లుల కోసం బాధపడుతున్నారు.

నిన్న ఈయన కేసీఆర్ పై నోరు పారేసుకుంటుంటే అందరూ నవ్వుకుంటున్నారు. అందరి తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే…లేదు లేదు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాం పెడదామని పెట్టాడు. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తిట్టాడు కదా దాన్ని కవర్ చేసుకోవటానికి ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు.

రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండంట. ఈ ముఖ్యమంత్రి తెలివి అట్ల ఉంది. ఈయనకు ఏమీ తెల్వదు. ఈయనకు తెల్వదన్న విషయం కూడా తెల్వదు. ఇది ఆయన పరిస్థితి. రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబ్బెజ్ కంప్యూటర్ కనిపెట్టాడు. కంప్యూటర్ ను ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ కాదు. 1955 లో టాటా గ్రూప్ వాళ్లు కంప్యూటర్ పరిచయం చేశారు.

రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసింది. చికెన్ గున్యాలు, విష జ్వరాలు, డెంగీలతో జనం బాధపడుతున్నారు.పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని పక్కన పెట్టారు. కనీసం పల్లెల్లో పిచికారి కి కూడా పైసల్లేవ్. పెట్రోల్ కు, చాక్ పీస్ లకు, జీతాలకు కూడా పైసలు లేని పరిస్థితి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చింది.

మొత్తం పాలన పక్కన పెట్టి కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 ను ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో అసలు పాలనే లేదు. గురుకులాల్లో పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గురుకుల టీచర్లను తొలగిస్తున్నారు.

రాష్ట్రంలో ఆలనా పాలన లేని పరిస్థితి ఉంటే…రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టండి.ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మీ వెంట పడుతాం. మీ అంతు చూస్తాం.తెలంగాణ తల్లి ఆత్మను అవమానించావు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావ్.

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం. నీకు అంత ఇష్టమైతే జూబ్లీహిల్స్ లో మీ ఇంట్లో పెట్టుకో.

గణేష్ నిమజ్జనం రోజు చెబుతున్నా రాసి పెట్టుకో. కచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. అదే విధంగా మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్లు ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తేమంటే అడ్డుకుంటారా? పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకొని అరెస్ట్ చేసిన మా విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాగానికి అభినందనలు.

LEAVE A RESPONSE