Suryaa.co.in

National

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: ఆగస్ట్‌ 2, 3 తేదీల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు – సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.

LEAVE A RESPONSE