– స్పీకర్ నిర్ణయం ప్రజామ్యానికి గొడ్డలి పెట్టు
– 10వ షెడ్యూల్ లో రాజ్యాంగ సవరణ చేయాలి
– మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్: స్వయంగా ఎమ్మెల్యే లు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ ఇవాళ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? 10వ షెడ్యూల్ లో రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్ లో వెంటనే పార్టీ పిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలి. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం పనికిమాలిన చట్టంగా తేల్చారు.
రాజీవ్ గాంధీ తెచ్చిన పార్టీ పిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ ను పనికి మలిన చట్టంగా స్పీకర్ ,ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ పిరాయించవచ్చు …స్పీకర్ దగ్గర పార్టీ పిరాయించలేదు. అని చెప్తే సరిపోతుంది.అని ఇవాళ స్పీకర్ ప్రసాద్ తీర్పు ఇచ్చారు. పార్టీ పిరాయింపుల చట్టాన్ని నీరుగార్చింది .పార్టీ పిరాయింపుల చట్టం పనికిమాలిన చట్టం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది.