– హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు పిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్ లు టీవీ లు ,సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు వెళ్ళేడానికి మ్యాన్ హోల్ లు ప్రమాదాలు జరగకుండా అక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలనీ సూచించారు.
విద్యుత్ స్తంభాల, విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్ ల రూపంలో సందేశాలు పంపాలని ఆదేశించారు. తీవ్రత అధికంగా ఉన్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు.
తాగునీటి సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా మంచినీటి నాణ్యత పరీక్షించాలి. బస్తీలు లోతట్టు ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగర ప్రజలు ఇలాంటి పరిస్థితులను మ్యాన్ హోల్ మూతలు తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హైడ్రా, జిహెచ్ఎంసి, పోలీసులు, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయాలి.