తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తనపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. పని పాటలేకుండా టీడీపీ సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గానీ పట్టలేదు. మా దేవినేని బ్లడ్లో ధైర్యం ఉంది” అని అవినాష్ అన్నారు.