– ఆలమట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు?
– మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయం పై స్పందించారు
– కృష్ణా ట్రిబ్యునల్ ను మహారాష్ట్ర- కర్ణాటక వ్యతిరేకించినా కేసీఆర్ మాటనే చివరకు నెగ్గింది
– ఆలమట్టి పై కర్ణాటక దూకుడును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి
– కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే రేవంత్ మౌనంగా ఉన్నారా ?
– కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలి
– ఆలమట్టి ఎత్తు పెరిగితే తెలంగాణ కు భారీ నష్టం
– మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్
కర్ణాటక ,మహారాష్ట్ర సీఎం లు నిన్న సమావేశాలు పెట్టుకున్నారు. కృష్ణా ట్రిబ్యునల్ 2013 లో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ తీర్పు ఫై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనల నేపథ్యం లో అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు లో ఎస్ ఎల్ పి వేస్తే ట్రిబ్యునల్ తీర్పు పై స్టే వచ్చింది.
2014 లో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టు స్టే కొనసాగించేలా చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
నిన్న కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ప్రాజెక్టు విస్తరణ కోసం లక్షా 33 వేల ఎకరాల భూ సేకరణ చేయాలని మంత్రి వర్గ సమావేశం లో నిర్ణయించింది.
ఈ భూ సేకరణ కోసం రెండేళ్ల లో 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కర్ణాటక లక్ష్యం గా పెట్టుకుంది. కర్ణాటక లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే.
కర్ణాటక ఆలమట్టి పై నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు. సుప్రీంకోర్టు స్టే పెండింగ్ లో ఉండగానే కర్ణాటక ఆలమట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయం పై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కృష్ణా నది లో ఒక్క నీటి చుక్క ను వదలుకోమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్ష సమావేశం లో చెప్పారు.
మరి కర్ణాటక అక్రమం గా ఆలమట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయం పై స్పందించారు.
ఆలమట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రం లోని రెండు జిల్లాలు సాంగ్లీ ,కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అడ్డుకుని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారు.
కేసీఆర్ పై ద్వేషమే తప్ప రేవంత్ రెడ్డి కి కృష్ణా జలాల్లో తెలంగాణ కు న్యాయం చేయాలని లేదు. కేసీఆర్ పట్టుదలతోనే సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి. కేసీఆర్ కృష్ణా ట్రిబ్యునల్ కోసం 33 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గించారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పదే పదే నిందలు వేస్తున్నారు. నిన్న కూడా సెప్టెంబర్ 17 వేడుకల ప్రసంగం లోనూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విషం చిమ్మారు.
తెలంగాణ ఏర్పడ్డ నెల రోజులకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం లేఖ రాశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు ను మహారాష్ట్ర కర్ణాటక వ్యతిరేకించినా కేసీఆర్ మాటనే చివరకు నెగ్గింది.
కేసీఆర్ పై నిందలు మాని ఆలమట్టి పై కర్ణాటక దూకుడును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా ? రేవంత్ రెడ్డి ఆలమట్టి ఎత్తు పెంపునకు ఒప్పుకున్నారా ? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సుప్రీంకోర్టు లో కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలి. ఆలమట్టి ఎత్తు పెరిగితే తెలంగాణ కు భారీ నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి.
కాంగ్రెస్ పార్టీకి బుద్దిరాదా?: టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్
299 టీఎంసీలు తెలంగాణకు,511 టీఎంసీలు ఏపీకి అనే ఒప్పందం తెచ్చింది ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క సంవత్సరంకు మాత్రమే
299 టీఎంసీలు తెలంగాణకు అని చెప్పారు.
299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారని అసత్య
ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు క్రిష్ణా నీళ్లు 100 టీఎంసీలకు మించి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకు అన్యాయం చేసింది.
పునర్విభజన చట్టంలో పెన్నా డెల్టాకు తీసుకువెళ్లిన నీటిని రెగ్యులరైజ్ చేశారు. కేసీఆర్ హయాంలో 28 సమావేశాలు పెట్టారు. కేసీఆర్ కృషి లేకుండానే కృష్ణా ట్రిబ్యునల్ వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.
కేసీఆర్ హయాంలో ఒక్క చెరువు తెగలేదు. రేవంత్ రెడ్డి పాలనలో చెరువులన్నీ తెగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బుద్దిరాదా? పక్క దేశాల్లో తిరుగుబాట్లు రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ చేసిన దాంట్లో గోరంత అయినా రేవంత్ రెడ్డి చేశారా? ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే పి . శశిధర్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సి .కళ్యాణ్ రావు ,లలిత రెడ్డి పాల్గొన్నారు.