Suryaa.co.in

Andhra Pradesh

ఆవోపా ఆధ్వర్యంలో పిడుగురాళ్లలోని డాక్టర్లకు సన్మానం

పిడుగురాళ్ల : జూలై 1: డాక్టర్స్ డే సందర్భంగా శనివారం పిడుగురాళ్ల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ (అవోపా) అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలువురు డాక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి, ఉన్నం హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు, డాక్టర్ ఉన్నం దీపిక, స్నేహ పిల్లల వైద్యశాల అధినేత డాక్టర్ గుర్రం కృష్ణ కాంత్, పల్నాడు హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ సి హెచ్ అశోక్ బాబు, డాక్టర్ రమ్య లను వారు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆవోప రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్త వెంకట చలపతిరావు, ఆవోపా పట్టణ అధ్యక్షులు గుడివాడ కుటుంబరావు, సలహా కమిటీ సభ్యులు ఏ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE