– మైక్రో బ్రెవరేజ్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్ లు
– అందులో 25 అప్లికేషన్ ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి
– ముఖ్యనేత కోటా కింద 21 టెండర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు
– .మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారు
– అందులో ఒక కోటి 50 లక్షలు ముఖ్య నేతకు వెళ్తాయి
– మరో 30 లక్షలు తోడుగా ఉన్న వ్యక్తికి
– హోలోగ్రామ్ టెండర్ వ్యవహారంలో అల్లుడుకి కావాలని ముఖ్యనేత.. మంత్రి కుమారుడుకి కావాలని మంత్రి పంచాయతీ
– మీడియా చిట్చాట్లో ఎక్సైజ్ అవినీతిని బట్టబయలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు
హైదరాబాద్: సింగరేణి లో బయటపెట్టాల్సిన ఇంకా కుంభకోణాలు ఉన్నాయి .ఈ రోజు ఎక్సయిజ్ శాఖ లో కుంభ కోణాన్ని బయట పెడుతున్నా.రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపింది. మైక్రో బ్రెవరేజ్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్ లు వచ్చాయి. అందులో 25 అప్లికేషన్ ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
అందులో ముఖ్యనేత కోటా కింద 21 టెండర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారు. ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్య నేతకు నీడగా ఉండే , ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటికి వెళ్తారు. ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నాడు.
ఒక్కొక్క బ్రైవరేజ్ దగ్గర అన్ అఫిషియల్ గా 1 కోటి 80 లక్షలు తీసుకునేలా ఒప్పందం.
అందులో ఒక కోటి 50 లక్షలు ముఖ్య నేతకు వెళ్తాయి, మరో 30 లక్షలు తోడుగా ఉన్న వ్యక్తికి వెళ్తాయి. వైన్స్ షాపుల లక్కీ డ్రా తియ్యకుండా , కొందరికి టెండర్ లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4 వేల 500 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టారు. 16 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదు. దీని వల్ల బ్రీజర్ సరఫరా రాష్ట్రంలో ఆగిపోయింది. చాలా షాపుల్లో బ్రీజర్ సరఫరా ఆగిపోయింది.
మిగిలిన కొన్ని కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. మల్టీ నేషనల్ కంపెనీలు సరఫరా నిలిపివేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాశారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీతో ఈ లాంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుంది
హోలోగ్రామ్ టెండర్ వ్యవహారంలో అల్లుడుకి కావాలని ముఖ్యనేత , మంత్రి కుమారుడుకి కావాలని మంత్రి పంచాయతీలో Iఐఏఎస్ అధికారి స్వచ్ఛంద విరమణకు దారి తీసింది. బీరు కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత , రైతులకు ఇవ్వడం లేదు .
ఈ ప్రభుత్వానికి రైతులు అంటే చులకన.మెదక్ జిల్లా సింగూర్ డ్యాం కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారు..సంగారెడ్డిలో 40 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.. మెదక్ జిల్లా ఘనపురం క్రింద 30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.. సంగారెడ్డి జిల్లాలో ఉండే బీరు కంపెనీలకు మాత్రం ఎటువంటి హాని లేకుండా బీరు కంపెనీలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాలతో బీరు కంపెనీలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం మద్యం తయారీ దారులకు కొమ్ము కాసే ప్రభుత్వంలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గీత కార్మికులను వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టీ జైలు పాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 850 మంది గౌడ్స్ మరణించారు. వారికి ఇవ్వాల్సిన ఒక్క రూపాయి ఇవ్వలేదు..
బిఆర్ఎస్ హయంలో 5 లక్షల భీమా పథకం తీసుకొచ్చి గౌడన్నల కుటుంబాన్ని మేము ఆదుకున్నాము.. కాంగ్రెస్ పార్టీ 10 లక్షల భీమా ఇస్తామని చెప్పి….10 రూపాయిలు కూడా ఇవ్వలేదు.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలం…. లక్ష్కర్ గూడ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అనేక మాటలు గౌడన్నలకు చెప్పి మోసం చేశారు. గౌడన్నలు అంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చింది. గల్లీ గల్లీకి మద్యం దుకాణాలు తెచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 10 వేల కోట్ల ఆదాయం పెంచుకున్నారు. మహిళలకు తులం బంగారం ఇవ్వడం లేదు గానీ, తాగుబోతుల తెలంగాణగా మాత్రం మార్చారు.