Home » పింఛన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి

పింఛన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: జూలై 1న జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మండల, టౌన్‌ అధ్యక్షులు, డివిజన్‌, వార్డు అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, సెక్షన్‌ ఇన్‌చార్జ్‌లు, అన్ని పార్టీ పదువుల్లో ఉన్న నాయకులు జనసేన, బీజేపీ ఎన్‌డీఏ కూటమి నాయకులందరూ ఆయా సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. నాయకులందరూ వార్డులలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని చెప్పారు.

Leave a Reply