Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నా….

– భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా
– ఎక్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: తిరుపతి లడ్డూ అపవిత్రమైందన్న అభియోగాల నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి శ్రీవారి భక్తులు అగ్గిమీద గుగ్గిలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆ వివరాలు యథాతథంగా…

‘ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఓం నమో! శ్రీ వెంకటేశాయ నమః’

LEAVE A RESPONSE