Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లిలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ

సజ్జలవి చిల్లర రాజకీయాలు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నడవడంలేదని.. వైకాపా కోడ్ నడుస్తోందని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాలు ప్రజలపై, పోలీస్ లపై దాడులు చేస్తే జగన్ తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు స్వామి భక్తి చూపిస్తున్నారని విమర్శించారు.

తాడేపల్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీకి కొమ్ముకాస్తే అధికారులకు మూల్యం తప్పదు. వైకాపాకు కొమ్ముకాస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవిని హెచ్చరించారు. సీట్ చీఫ్ మాదిరే ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. జగన్, సజ్జల, దనుంజయ్ రెడ్డి మాటలు వింటే తప్పకుండా బాధ్యులవుతారని గుర్తు చేశారు. బాధ్యత గల అధికారులు ప్రజల కోసం పనిచేయాలన్నారు.

జగన్ బస్సు యాత్ర… తుస్సు యాత్ర అయ్యింది. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతో ప్రజలను భయపెడుతున్నారన్నారు. బస్సు యాత్రకు జనం రాక.. బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్ర కావడంతో… సజ్జలకు ప్రెస్టేషన్ పెరిగి ప్రెస్ మీట్ లు పెడుతున్నాడని దేవినేని మండిపడ్డారు.

సజ్జలవి చిల్లర రాజకీయాలు. ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ సజ్జల దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ 5, ఈనాడు, చంద్రబాబు ల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ములు దిగమింగుతున్న ప్రభుత్వ సలహాదారులు ఎవరికి పనిచేస్తున్నారు ? ఎవరికి సలహాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఇకనైనా సజ్జల చిల్లర చేస్టలు చిల్లర రాజకీయాలు, ఫేక్ మాటలు మానుకోవాలని హితవు పలికారు.

తాడేపల్లి నెస్ట్ స్పేస్ బిల్డింగ్ లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ని తండ్రి కొడులు నడుపుతూ.. ఫేక్ నూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ దేవినేని తెలియజేశారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు 300 మంది పనిచేస్తున్నారన్నారు. ఐబీ ఎంబ్లమ్ ను మార్చి ఫేక్ న్యూస్ లు పోస్ట్ చేసేంత దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. దీనికి కీలక సూత్ర దారి సజ్జల తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డే అన్నారు.

ఇంత జరుగుతున్నా.. వీటిపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలన్నారు. వెంటనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై దాడి చేసి పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై సీఈవో, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని దేవినేని తెలిపారు.

LEAVE A RESPONSE