– క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
– స్టీడ్ రాకతో రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు మెరుగైన అవకాశాలు
– ఈ నియామకం ఆంధ్రా క్రికెట్ ప్రగతిలో కీలక మైలురాయి
– ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు
అమరావతి: 2025-26 రంజీ సీజన్కు ఆంధ్రా పురుషుల క్రికెట్ జట్టుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ గ్యారీ స్టీడ్ను హెడ్ కోచ్గా నియమించినట్లు ఏసీఏ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది.
ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రా ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. న్యూజిలాండ్ జట్టు కోచ్గా గ్యారీ స్టీడ్ పదవీకాలం ముగియడంతో ఆయన్ను సంప్రదించాం. అన్ని ఫార్మాట్లలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నాయకత్వంలో మన ఆటగాళ్లలో పోటీతత్వం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నాం అని శివనాథ్ వివరించారు.
ఈ నియామకం ఆంధ్రా క్రికెట్ ప్రగతిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. గ్యారీ స్టీడ్ అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని, ఆయన మార్గనిర్దేశనంలో ఆంధ్రా జట్టు రంజీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీడ్ వంటి మేటి కోచ్ రాకతో రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని సానా సతీష్ బాబు వివరించారు.