Suryaa.co.in

Telangana

ప్రీతిది ముమ్మాటికీ ‘‘లవ్ జిహాదీ కేసు’’

• టార్గెట్ చేసి అమ్మాయిలను వేధిస్తున్నారు
• విదేశాల నుండి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయి
• కేసును నీరుగార్చేందుకు పోలీసుల యత్నం
• సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
• కేసీఆర్ ది ఐరన్ లెగ్…అడుగు పెట్టిన చోట మఠాష్
• కొండగట్టుకు వెయ్యి కోట్లు దేవుడెరుగు.. గర్భగుడిలో దొంగ తనమా?
• తెలంగాణ ప్రజలంతా మీ కుటుంబ సభ్యులైతే ఇండ్లు, ఉద్యోగాలెందుకు ఇస్తలేరు?
• రైతులు, ఆర్టీసీ కార్మికులు, పేదల ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదు?
• కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ ‘‘లవ్ జిహాదీ’’ కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురి చేస్తున్నారని, అందుకోసం విదేశాల నుండి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయని చెప్పారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయం వద్ద బండగి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందులోని ముఖ్యాంశాలు…

వరంగల్ లో మెడికల్ విద్యార్ధిని ప్రీతిపై ర్యాగింగ్ చేయడంవల్లే ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారు. అనేక సార్లు అమ్మాయిపై వేధింపులకు గురిచేసిందని ప్రీతి తండ్రే చెప్పారు. దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర. వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యలుపై చూపకపోవడం. ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నరు. ఇతర దేశాల నుండి డబ్బులొస్తున్నాయి. అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జిహాదీ పేరుత వేధిస్తున్నరు. ఈ కేసును నిర్వీర్యం చేయడానికి తూతూ మంత్రంగా కేసులు పెట్టి నిందితుడిని రక్షించే యత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చినిపోతే కుక్కలకు మటన్ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం సిగ్గు చేటు. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నిందితుడిని కఠినంగా శిక్షించారు. కేసీఆర్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలంటే చులకన. వాళ్లకు ఏం జరిగినా పట్టించుకోని మూర్ఖుడు.

కొండగట్టు ఆలయంలో గర్భగుడి దగ్గర దొంగతనం జరగడం సిగ్గు చేటు. కేసీఆర్ ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మఠాష్ అవుతోంది. యాగాలు చేస్తే యాగశాల అహుతైంది. యాదాద్రికి పోతే వరదలొచ్చే. కొండగట్టుకు వస్తే దొంగతనం జరిగే… కొండగట్టుకు వెయ్యి కోట్లు రాకపోగా దొంగలొచ్చి దొంగతనం జరిగింది. రేపో మాపో ఈ కేసును కూడా నీరుగారుస్తారు. మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని అమాయకులను ఇరికించే కుట్ర చేసే ప్రమాదం ఉంది. కేసీఆర్ ది దొంగ పూజ. ఆయన కొడుకు దేవుడినే నమ్మని నాస్థికుడు, మూర్ఖుడు. హిందుగాళ్లు బొందగాళ్లని హేళన చేసిన మీ అయ్యతోనే నిఖార్సైన హిందువునని చెప్పించడమే కాకుండా మీ బూతు పత్రికలో నిలువెత్తు ఫొటో వేసేలా చేసిన ఘనత బీజేపీదే.

లంగ దందా, దొంగ దందాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం. ఒకరిది ఇసుక దందా, ఇంకొకరిది డ్రగ్స్ దందా, మరొకరిది దొంగ సారా, పత్తాల దందా… ఈ దందాలను ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం తెలంగాణకు ఏమీ చేయడం లేదని అబద్దాలాడుతూ సెంటిమెంట్ ను రగిల్చే యత్నం చేస్తున్నారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివ్రుద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. దమ్ముంటే సవాల్ ను స్వీకరించారు.
తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబ సభ్యులేనని చెప్పడం పెద్ద జోక్. తెలంగాణ ద్రోహులే కేసీఆర్ కుటుంబ సభ్యులు. తెలంగాణ ప్రజలు నిజంగానే కుటుంబ సభ్యులైతే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ నాడు జీతాలెందుకు ఇస్తలేరు. ఉద్యోగాలెందుకు ఇస్తలేరు. పేదలు, రైతులు కష్టాల్లో ఉంటే ఎందుకు స్పందించడం లేదు? దళిత బంధు, గిరిజన బంధు ఎందుకిస్తలేవు?

LEAVE A RESPONSE