Suryaa.co.in

Telangana

హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి

-నక్సలైట్ ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా కేసులు పెడతారా?
– నక్సలైట్ల ఏజండా నే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే
– ఎంపీ, టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ప్రొ. హరగోపాల్ తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్ల లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తోంది. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి.ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాది.

సెంట్రల్ యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసర్. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడు.

నక్సలైట్ ఎజెండా నే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్ల కు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య.. ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే, నక్సలైట్ల ఏజండా నే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా? నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా కేసులు పెడతారా?
హరగోపాల్ తో పాటు 152 మంది పైన కేసులు యత్హెయ్యాలి.తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్ కు అండగా ఉండాలి..హరగోపాల్ తో పాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది

ప్రజాస్వామిక పౌర సంఘాలు బిఆర్ఎస్, బిజేపీ లకు వ్యతిరేకంగా ప్రజల కోసం పై చేస్తుండడంతో ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎతెస్తాం..

 

LEAVE A RESPONSE