Suryaa.co.in

Andhra Pradesh Telangana

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్ రావు దంపతులు!

తెలంగాణ మంత్రి హరీశ్ రావు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన… ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

LEAVE A RESPONSE