Suryaa.co.in

Telangana

మీ పాలన లేకుంటే….లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 50 లక్షల కోట్లు దాటుతుంది

-75 ఏళ్లలో వచ్చిన పెట్టుబడుల్లో 50 శాతానికిపైగా మోదీ పాలనలో సాధించినవే
-150కి పైగా దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
-కేసీఆర్ కుటుంబ భూదందా, కమీషన్ల దందాను చూసి పారిపోతున్న పెట్టుబడిదారులు
-పంచ భూతాలను వ్యాపారంగా మారుస్తున్న మూర్ఖులు
-కేసీఆర్ 24 గంటలు చెప్పేవన్నీ కరెంట్ ‘‘కోతలే’’
నిరూపిస్తే… రాజీనామా చేసేందుకు నేను సిద్ధం
లేనిపక్షంలో సీఎం పదవి నుండి తప్పుకుంటావా?
-సామాన్య కార్యకర్త సీఎం, పీఎం, అధ్యక్షులయ్యే అర్హత బీజేపీలోనే సాధ్యం
-బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త సీఎం, అధ్యక్షుడు కాగలరా?
-అయ్య పేరు చెప్పుకుని పదవులు తీసుకున్నోడు నాపై విమర్శలా?
-దేవుడిని, పంచభూతాలను సైతం వ్యాపారం చేసే మూర్ఖులు మీరు
-అబద్దాలను ప్రచారం చేసుకోవడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్న దుర్మార్గులు
-బీజేపీ అధికారంలోకి వస్తే ఎంతవరకైనా చదవండి… ఫ్రీగా చదివించే బాధ్యత మాదే
-ఉచితంగా వైద్యం అందిస్తాం…. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం.. ఫసల్ బీమా అమలు చేస్తాం
-ఆలేరు ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ లో కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

‘‘ఇయాళ ట్విట్టర్ టిల్లు అంటడు… 2030 నాటికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువను 250 బిలియన్ డాలర్ల (20 లక్షల కోట్ల రూపాయలు)కు పెంచుతాడట… ఇప్పుడు నేను చెబుతున్నా…. మీ కుటుంబం లేకపోతే 2030 నాటికి హైదరాబాద్ లైఫ్ సెన్సెస్ ఇండస్ట్రీ విలువ 500 బిలియన్ డాలర్లకుపైగా (50 లక్షల కోట్ల రూపాయలకు) పెరుగుతుంది. నీ కుటుంబం చేసే భూ దందాలకు, కమీషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనను చూసి 150 దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. గత 75 ఏళ్లలో దేశానికి ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయో… అందులో 50 శాతానికిపైగా మోదీ పాలనలోనే వచ్చినవేనని చెప్పారు. దీనినిబట్టి మోదీ పాలన పట్ల ప్రపంచ దేశాలకు ఎంత నమ్మకమో అర్ధమవుతోందన్నారు. హైదరాబాద్ లాంటి గొప్ప నగరం ఉన్న తెలంగాణకు అందులో కనీసం 5 శాతం కూడా రాబట్టలేని అసమర్ధులు కేసీఆర్ కుటుంబమని అన్నారు. దీనిని బట్టి బీఆర్ఎస్ పాలన ఎంత అసమర్థంగా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. మన పక్కన కర్నాటకతో పోలిస్తే సగం పెట్టుబడులు కూడా సాధించలేకపోతున్నారంటే మీ అసమర్థత ఏంటో అర్ధమైతుందన్నారు. ఈరోజు ఆలేరులో జరిగిన ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ కు హాజరైన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జిట్టా బాలక్రిష్ణారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ ఏమన్నారంటే…… ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు…

సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర, జాతీయ అధ్యక్షులతోపాటు ప్రధానమంత్రి అయ్యే అర్హత ఒక్క బీజేపీలో మాత్రమే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరైనా సీఎం, పార్టీ అధ్యక్షులయ్యే అర్హత ఉందా? అమెరికాలో చిప్పలు కడిగి వచ్చి అయ్య పేరు చెప్పుకుని పదవులు సంపాదించినోడు ట్విట్టర్ టిల్లు నాపై అవాకులు చవాకులు పేలుతున్నడు… నీ అయ్య లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు. నీలెక్క అయ్య పేరు చెప్పుకుని అధ్యక్షుడిని కాలే… కష్టపడి వచ్చిన. దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు పోయి వచ్చిన. యాదాద్రిలో డబుల్ బెడ్రూంలు వచ్చాయా? మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయా? మోదీగారు పువ్వు గుర్తుకు ఓటేయకపోయినా తెలంగాణకు 2.4 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు? కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. మోదీ ఇచ్చిన ఇండ్లు ఇస్తే పువ్వు గుర్తుకు ఓటేస్తారనే భయంతోనే ఆ ఇండ్లను కూడా ఆపేసిండు. పక్క రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే 70 వేల ఇండ్లు కట్టించి దసరా పండగ నాడే గ్రుహ ప్రవేశం చేయించినం.

కేసీఆర్ మాత్రం 100 గదుల ఇల్లు కట్టుకున్నడు. రోజుకో రూంల తాగి పండుకుంటడు తప్ప పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇయ్యలే.. మీలో ఎవరికైనా ఉద్యోగాలొచ్చినయా? ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నడు. నెలనెలా రూ.3 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నడు? ఏమైంది? ఒక్క ఉద్యోగమియ్యలే. మోదీ ప్రభుత్వం గత 3 నెలల్లోనే 2.16 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అపాయిట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. ఈ ఏడాదిలోనే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నడు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం 5 గురికి ఉద్యోగాలిచ్చుకున్నడు. నెలకు 20 లక్షలకుపైగా జీతం తీసుకుంటున్నడు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తుందా? అమెరికా, లండన్ లో కూడా 24 గంటల కరెంట్ లేదట… తెలంగాణలో మాత్రమే అమలు చేస్తున్నారట… నేను సవాల్ చేస్తున్నా… ‘‘నీకు ధమ్ము, ధైర్యం ఉంటే ఆలేరు చౌరస్తాకు రా… 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేసి పోతా…. నిరూపించకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారు. పొలం కాడ ఫ్రీ కరెంట్ అంటున్నవ్… ఇండ్లకాడ కరెంట్ ఛార్జీలు పెంచి దోచుకుంటున్నవ్? పైగా పొలం కాడ ఇస్తున్న ఫ్రీ కరెంట్ పైసలు డిస్కంలకు చెల్లించకపోవడంతో రూ.60 వేల కోట్లకుపైగా బకాయిలున్నయ్.. రాబోయే ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. మరి కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇస్తున్నట్లు?

రుణమాఫీ అమలు చేయలేదు. రైతుల లోన్లకు వడ్డీవడ్డీ కట్టలేక చస్తున్నరు. కిసాన్ సమ్మాన్ నిధి కింద మోదీ ప్రభుత్వం డబ్బులు ఖాతాలో వేస్తే… ఆ డబ్బులను కూడా రుణమాఫీ కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నయి. మీ జిల్లాలో కోతుల బెడద ఎక్కువ. జిల్లాలో 7.5 లక్షల జనాభా ఉంటే… కోతులు 6.5 లక్షలున్నయ్. కోతులన్నింటినీ అడవులకు పంపుతానని హరితహారం పథకం పెట్టిన కేసీఆర్ ఏం చేసిండు? హరితహారం ద్వారా 7 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టి అడవుల విస్తీర్ణం పెంచినట్లు ఫోజులు కొట్టినవ్.. ఆ డబ్బుంతా దోచుకున్నవ్. కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోరు. కుక్కులకు మటన్ ముక్కలు దొరకక పిల్లలపై దాడులు చేస్తున్నయని ఎటకారంగా మాట్లాడుతున్నరు.యాదగిరిగుట్ట, కొండగట్టు దేవాలయాల పేరుతో భూముల దందా. యాదాద్రిలో వేల ఎకరాల భూములను కొన్నడు. వ్యాపారం చేసి వేల కోట్లు దోచుకున్నడు. ఇప్పుడు కొండగట్టుపై పడ్డరు. ఆ చుట్ట పక్కలనున్న భూములన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులు, బినామీలు కొనేశారు. కొండగట్టు ఆలయంలో దొంగలు పడి వస్తువలన్నీ దోచుకుపోయినరు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. నయీం డైరీ ఎటుపొయింది? మేం అధికారంలోకి రాగానే నయీం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. ఆ ఆస్తులను ఎవరూ కొనొద్దు.

యాదాద్రిపై కేసీఆర్ కుటుంబానికి ప్రేమ లేదు. అదొక వ్యాపారం మాత్రమే. కేసీఆర్ కొడుకే ఈ మాట చెప్పిండు. యాదాద్రిపై వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని చెబుతూ దేవుడిని కూడా వ్యాపారం చేస్తున్న మూర్ఖుడు. నేను బరాబర్ ధర్మం గురించి, దేవుడిని నమ్ముతా. కేసీఆర్ కొడుకు మూర్ఖుడు. దేవుడిని నమ్మని నాస్తికుడు. యాగశాలలో ఫొటోల కోసం వస్తే.. ఆ యాగశాలే కాలిపోయింది. నికార్సయిన హిందువు పేరుతో కేసీఆర్ హిందువులను మోసం చేయాలనుకుంటున్నడు. రోజుకో దేవుడిని మొక్కుతారంటూ ఎంఐఎం నేతలు ఎటకారం చేస్తున్నరు. బరాబర్ రోజుకో దేవుడిని మొక్కుతాం. మీకేం నొప్పి?1400 మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోంది. రాష్ట్రాన్ని దోచుకుంటోంది. పేదలు అన్యాయమైపోయినరు. మోదీది పేదల ప్రభుత్వం. రేషన్ బియ్యం ఇస్తున్నది మోదీయే. కిలోకు 29 రూపాయలు చెల్లించేది కేంద్రమే. రైతు వేదికలకు, కమ్యూనిటీ భవనాలు, మరుగుదొడ్లు, స్మశానవాటికలు, రోడ్లు, స్ట్రీట్ లైట్ల పైసలన్నీ కేంద్రం ఇస్తున్నవే. కానీ కేసీఆర్ ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నరు. అందుకే రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలి.

పేదలు చచ్చిపోతే పట్టించుకోని కేసీఆర్ పెద్దలు చనిపోతే మాత్రం పోయి గొప్పగా అంతిమ సంస్కారాలు చేయిస్తడు. వరదలొచ్చి జనం అల్లాడుతుంటే పైసలు సంపుకుంటున్నరు. డ్రగ్స్ దందాలకు, ఇసుక దందాలకు, పత్తాల దందాలకు, చివరకు దొంగ సారా దందా చేస్తున్నరు. చివరకు పంచ భూతాలను కూడా దోచుకుంటున్నరు. పేదలవి బాంచన్ బతుకులైతున్నయ్. కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్లు దోచుకుంటోంది. అందుకే పేదల ప్రభుత్వం రావాలి. రామరాజ్యం రావాలంటే పువ్వు గుర్తుకే ఓటేయండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి పువ్వు గుర్తుకు అవకాశమివ్వండి. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ పాలనలో స్కూళ్లలో కనీస సౌకర్యాల్లేవు. చాక్ పీసుల్లేవు. కుర్చీల్లేవు. ఫ్యాన్లు లేవు… స్కావెంజర్లు లేరు. బీజేపీ అధికారంలోకి వస్తే మీ పిల్లలందరికీ ఎంత వరకు చదివితే అంత వరకు ఉచితంగా విద్యను అందించే బాధ్యత తీసుకుంటాం…ఈరోజుల్లో రోగమొస్తే చికిత్స చేయించుకోలేక జనం చచ్చిపోతున్నరు. కోవిడ్ టైంలో ఏం జరిగిందో మీరు చూశారు. మోదీగారు వ్యాక్సిన్ ఇయ్యకపోతే ఏమయ్యేదో ఊహించుకోండి. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు ఆ రోగమొచ్చినా ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను తీసుకుంటాం.

ఇయాళ పేదలకు ఇండ్లు లేవు. కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నరు. పువ్వు గుర్తుకు అవకాశమిస్తే యాదాద్రి జిల్లాసహా రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.గత 8 ఏళ్లుగా రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోయి అల్లాడుతున్నరు. కేసీఆర్ ఫ్రభుత్వం నయాపైసా సాయం చేయలే. మేం అధికారంలోకి వస్తే ఫసల్ బీమా యోజన భీమా పథకం కింద పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం. డబ్బులకు ఓట్లను అమ్ముకోవద్దని కోరుతున్నా. హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని డబ్బులిచ్చినా తీసుకుని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి చెంప చెళ్లుమన్పించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతగా దిగజార్చారంటే… తప్పుడు ప్రచారం చేసుకోవడానికే ఈసారి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఏ స్తాయికి దిగజారిపోయారో అర్ధం చేసుకోవాలి. 2030 నాటికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువను 250 బిలియన్ డాలర్ల (20 లక్షల కోట్ల రూపాయలు)కు పెంచుతాడట ట్విట్టర్ టిల్లు… ఇప్పుడు నేను చెబుతున్నా…. మీ కుటుంబం లేకపోతే 2030 నాటికి 50 లక్షల కోట్ల రూపాయలకు ఈ పరిశ్రమ విలువ పెరుగుతుంది. నీ కుటుంబం చేసే భూ దందాలకు, కమీషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారు.

దేశంలో అట్లాకాదు.. మోదీ గారి పాలనను చూసి 150 దేశాల భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గత 75 ఏళ్లలో దేశానికి ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయో… అందులో 50 శాతానికిపైగా మోదీ పాలనలోనే వచ్చాయి. అంటేనే మోదీ పాలన పట్ల ప్రపంచ దేశాలకు ఎంత నమ్మకమో అర్ధమవుతోంది. హైదరాబాద్ లాంటి గొప్ప నగరం ఉన్న తెలంగాణకు అందులో కనీసం 5 శాతం కూడా రాబట్టలేకపోయావంటే మీ పాలన ఎంత అసమర్థంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన పక్కన కర్నాటకతో పోలిస్తే సగం పెట్టుబడులు కూడా సాధించలేకపోతున్నారంటే మీ అసమర్థత ఏంటో అర్ధమైతుంది.

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి 5.30 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఒక్కో కుటుంబంపై రూ. 6 లక్షల అప్పు భారం మోపిండు. మళ్లీ పొరపాటున గెలిస్తే మరో 6 లక్షల భారం మోపి మీ జీవితాలను సర్వనాశనం చేయబోతున్నడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తేనే ఆ అప్పులను తీర్చి ప్రజల జీవితాలను బాగు చేసే అవకాశం ఉంది. కేసీఆర్ కు 2 సార్లు ఓటేసి గెలిపిస్తే ఏం చేశారు? పిట్ట కథలు చెప్పడం తప్ప. ఫాంహౌజ్ లో పండుకోవడం తప్ప. దేశంలోని ప్రజలు నవ్వుకుంటున్నరు. కేసీఆర్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటడు. తంబాకుకు, లవంగాకు తేడా తెలియని మూర్ఖుడు. టెస్ట్ చేయించుకుందా రా అని సవాల్ చేస్తే తొకముడిచిండు. డ్రగ్స్ ఆనవాళ్లన్నీ ఒంట్లోంచి పోయాయని తెలిశాక వచ్చి వాగుతుండు. ఆ మూర్ఖుడు ఇయాళ నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.. అమెరికాకు పోయి చిప్పలు కడిగి వచ్చినోడు.. అయ్యపేరు చెప్పుకుని పదవులు సంపాదించుకున్నోడు మంత్రి కావొచ్చట… ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం పోరాడి జైలుకు పోయి వచ్చిన నేను రాష్ట్ర అధ్యక్షుడు కాకూడదట.

LEAVE A RESPONSE