Suryaa.co.in

Telangana

అది క్షుద్ర పూజ కాదు..గిరిజన పూజ

– ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాను
-సేవా కార్యక్రమాలు ఓర్వలేకనే తప్పుడు ప్రచారం
– డీహెచ్ డా. గడల శ్రీనివాసరావు

తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని హెల్త్ డైరెక్టర్ డా.జీ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యంగిరా దేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే
samayam-teluguభద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవత తో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు.

కానీ స్వర్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని నొక్కి చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదన్నారు. మెగ హెల్త్ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు.

విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానన్నారు. ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.

LEAVE A RESPONSE