Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు సమర్థతకు నిదర్శనమే రాష్ట్రానికి అధిక నిధులు

-కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే గద్దె రామమోహన్

అమరావతి: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయింపు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్ధతకు నిదర్శమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హర్షం వ్యక్తం చేశారు.

గత పాతిక సంవత్సరాలుగా రాష్ట్రానికి ఈ విధంగా కేంద్రం నుంచి ఆంధ్రరాష్ట్రానికి నిధులు కేటాయించిన సందర్భాలు లేవని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులను రాష్ట్రంలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం రాబట్టగలిగిందని అన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం, అవసరాన్ని బట్టి అదనపు నిధులకు హామీ, పోలవరం ప్రాజెక్టుకు అధికంగా నిధులు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు, విభజన చట్టంలో ఉన్న హామీల అమలుకు హామీ, ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్టును రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాబట్టగలిగిందన్నారు.

LEAVE A RESPONSE