Suryaa.co.in

Telangana

మైనారిటీ కమిషన్ సభ్యుడిగా హిమాన్షు బాప్నా

మైనారిటీ కమిషన్ సభ్యుడిగా జైన సమాజ్ కు చెందిన హిమాన్షు బాప్నా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఈయన మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.

తనను మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు, సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు హిమాన్షు కృతజ్ఞతలు తెలిపారు.

 

LEAVE A RESPONSE