Suryaa.co.in

Telangana

హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు రద్దు

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది.

అయితే, తగినంత డిమాండ్‌ లేక పోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పెర్కొంది.

LEAVE A RESPONSE