Suryaa.co.in

Telangana

హైదరాబాద్ తెలంగాణకి గుండె కాయ

– తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు
-హైదరాబాద్ లోని మూసి, లెక్ సిటి డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం
– మూసి కాల్వ ఇరు వైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చెపిస్తలేము
– మూసి బాధితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇచ్చి ఆదుకుంటాం
– మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా: నేడు కరీంనగర్ లో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు ప్రారంభం చేశాం. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు. హైదారాబాద్ తెలంగాణ కి గుండె కాయ. హైదరాబాద్ లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తున్నము. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలే కృష్ణ, గోదావరి జలాలు ద్వారా హైదారాబాద్ ప్రజలకి త్రాగునీరు కి ఇచ్చాం.

పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో వర్షాలు వస్తె హైదారాబాద్ లో నాళాలు మునిగి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. హైదారాబాద్ లోని మూసి, లెక్ సిటి డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. మూసి కాల్వ ఇరు వైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చెపిస్తలేము, అలా ప్రచారం చేయడం సరికాదు. మూసి బాధితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇచ్చి ఆదుకుంటాం.

మూసి బాధితుల పట్ల ప్రతిపక్షాలు , హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు అది మంచి పద్దతి కాదు. మూసి నీ మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వం లో మేము ప్రతి పక్షంలో ఉన్నపుడు సమస్యలపై మాకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం లో నిర్వాసితులను లాఠీలతో అణిచి వేశారు, మేము బాధితులను సమన్వయ పరుస్తున్నం.

అధికారం లేదని బిఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మూసి నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు అడుకోవద్దు. యావత్ రాష్ట్రంలో హైడ్రా ను స్వాగతిస్తున్నారు. రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తం. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేద్దాం.

LEAVE A RESPONSE