Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ నియంత్రణకు కమిటీ వేస్తే కాకాణికి అంత ఉలుకెందుకో?

సీఎంల సమావేశాన్ని అభినందించాల్సిదిపోయి..అవాకులు. చెవాకులు పేలుతారా?
కేసుల భయంతో చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్న కాకాణి కూడా ఆయన గురించి మాట్లాడటమా?
నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు:  చాలా కాలం తర్వాత ఇద్దరు సీఎంలు సమావేశమై రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి చర్చిస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఇద్దరు సీఎంలు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కలిసి చర్చించిన సమావేశంపై అంత ఏడుపెందుకో?

తిరుమల దేవస్థానంలో వాటా కోరారు, ఓడరేవుల్లో భాగం అడిగారు, సముద్ర తీరంలో వాటా కావాలన్నారు..అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ సమావేశంలో కాకాణి పిల్లిలా టేబుల్ కింద కూర్చుని విన్నాడా? గత ఐదేళ్లలో ఒక సీఎం ప్యాలెస్ కు, మరో సీఎం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.ఒకరి రాష్ట్రంలో మరొకరు ఆస్తులు దోచుకునే లోపాయకారి ఒప్పందాలకు పరిమితమయ్యారు.

సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల గడవక ముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్నారు.ఒక అడుగు తగ్గి తెలంగాణ సీఎంతో సమావేశానికి వెళ్లారు. ఈ సమావేశాన్ని అభినందించాల్సింది పోయి అవాకులు..చెవాకులు పేలుతారా? అయినా ప్యాలెస్ లో కూర్చునుండేవారికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయిలే.

అదే జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలంటే రోడ్ల పక్కన చెట్లు నరకాలి..హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుంటే కింద దుకాణాలు మూసేయాలి.జగన్మోహన్ రెడ్డి కాలు బయటపెడుతున్నారంటేనే కర్ఫ్యూ వాతావరణంతో నియంతలా ఎమర్జెన్సీ రోజులను మరిపించారు.30 ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కుని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన వాటా నిధులను తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు.

వ్యవసాయ శాఖ పరిధిలో కేంద్రం నుంచి రావల్సిన 60 శాతం నిధులను తెచ్చుకోలేక అనేక కీలక పథకాలను మూలనపెట్టిన మీరు రాష్ట్రాలు, వాటాలు గురించి మాట్లాడుతారా? రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయి సర్వేపల్లిలో కూర్చుకుని ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి, టోలు గేట్ దందాలతో బతికాడు.

కల్తీ మద్యం కేసుల్లో నుంచి బయటపడేయాలని చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడిన కాకాణి కూడా ఈ రోజు ఆయన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

నా కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయంటూ నకిలీ పత్రాలు సృష్టించాడు. ఈ రోజుకీ సుప్రీం కోర్టు ఇచ్చిన కండీషన్ బెయిల్ పై బతుకుతున్నాడు.

జగన్మోహన్ రెడ్డి 30 కేసులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఏ కేసులోనూ తప్పించుకోలేరు. ఓ వైపు చేసేదంతా దోపిడీ…మరోవైపు చెప్పేవన్నీ అబద్ధాలు, కూసేవన్నీ బొల్లికూతలు. చంద్రబాబు నాయుడు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇక నైనా మానుకోండి. ఆయనేమైనా ప్యాలెస్ కు పరిమితమయ్యే పిల్లి అనుకుంటున్నారా?

అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినా లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సాక్షిలో పిచ్చి కూతలు రాస్తున్నారు. ఆ సాక్షి పత్రికను ప్రజలెవరూ చదవకపోవడంతో వలంటీర్ల పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు కట్టి సర్క్యులేషన్ పెంచుకునే ప్రయత్నం చేశారు. రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ ను అక్రమంగా జైలుకు పంపాలని ఐదేళ్లూ జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు.

ఓ వైపు పత్రికా రంగం, మరో వైపు సినీరంగం, ఒక ఫిల్మ్ సిటీ, ఒక మార్గదర్శి..ఇలా రోల్ మోడల్ గా నిలిచిన రామోజీరావును జైలుకు పంపాలని ప్రయత్నం చేసిన మీరు కూడా పత్రికల గురించి మాట్లాడుతారా? తిరుమలలో వాటా అడిగారంట..ఈ మాట అనడానికి సిగ్గుందా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల ఏడు కొండలు కాదు..మూడు కొండలు అని మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కోట్లకు కోట్లు దోచుకుని తిరుమల క్షేత్రంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించారు.

ప్రపంచలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చిన మీరు తిరుమల గురించి మాట్లాడటమా? ఏడో తరగతి పిల్లల బ్యాగుల్లోనూ గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితికి రాష్ట్రాన్ని వైసీపీ తీసుకొచ్చింది.ఈ డ్రగ్స్ నియంత్రణకు ఇరు రాష్ట్రాలు ఇద్దరు డీజీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడాన్ని మీరు తప్పుపడతారా?డ్రగ్స్ పై విచారణ జరిగితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గుట్టు బయటపడిపోతోందని కాకాణి వణికిపోతున్నాడు.

2023లో ఆయనకు జారీ చేసిన ఎమ్మెల్యే స్టిక్కర్ రేవ్ పార్టీ వద్ద దొరకడంతో ఆయనలో భయం ఎక్కువైంది.వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలు, దోపిడీ, అవినీతి దేనినీ వదిలిపెట్టం. సర్వేపల్లి నియోజకవర్గంలో వందల మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించాడు, వందల మందిని జైళ్లకు పంపించాడు.

చేసిన ప్రతి తప్పుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫలితం అనుభవించాల్సిందే. కాకాణి చేసిన పాపాలకు ఇప్పటికే ఎందరో సస్పెండ్ అయ్యారు. ఇంకెంతమంది అధికారులు సస్పెండ్ అవుతారో, ఎంత మంది జైళ్లకు వెళుతారో చూద్దాం. నారా చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకుంటే ఫలితం అనుభవించక తప్పదు. అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలను చూసి జగన్మోహన్ రెడ్డికి ఫ్యాంట్లు తడిచిపోతున్నాయి.

రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

నెల్లూరులో పిన్నెళ్లిని పరామర్శించేందుకు వచ్చినప్పుడు చెట్లు నరికించలేదని, షాపులు మూయించలేదని బాధ పడుతున్నారా? రేపు పిన్నెళ్లికి తోడుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తే చెట్లు నరికిస్తాం, షాపులు మూయిస్తాం, బ్యారికేడింగ్ చేయిస్తాం.

 

LEAVE A RESPONSE