– ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరిక
విజయవాడ: రాష్ట్రంలో ఇప్పటి నుండి వ్యవసాయనికి ఈ ఖరీఫ్ సీజనులో ఇంకా యూరియా ఎంత కావాలి? ప్రధాన పంటలైన వేరుశనగ, పప్పు ధాన్యాలకు యూరియా అవసరం లేదు.. ప్రత్తికి ఎరువు వేసే సమయం దాటిపోయింది… యూరియా కావలసినది వరి, మొక్క జొన్న, చెరకు పంటలకు.. హార్టికల్ లో కూరగాయలకు, అరటి కి మరికొన్ని పంటలకు తక్కువ మోతాదు లో కావాలని ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఆందోళనలకు గురవుతున్నారని, వరి, మొక్కజొన్న సాగు చేసిన ప్రాంతాలలోనే యూరియా కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఖరీఫ్ లో వరికి ఎకరానికి 70 కిలోలు కామ్ ప్లెక్స్ (40 కిలోలు డీఏపీ+30 కిలోలు ఎన్పీకె కాంబినేషన్ ఉన్న కంప్లెక్స్) 70 నుండి 75 కిలోలు యూరియా 4 ధఫాలు గా వాడతారని, ఈ ఖరీఫ్ లో ఈ నెల మూడోతేదీ నాటికి వరి 32 లక్షల ఎకరాలలో సాగు జరిగిందని తెలిపారు. దీనిలో 2.5 లక్షల ఎకరాలు 13 వ వారం 27 ఆగస్టు నుండి ఈ నెల మూడోతేదీ వరకు జరిగిందని తెలిపారు. ఈ వారం, రాబోయే వారం మరొక 2.5 లక్షల ఎకరాలలో సాగు జరగవచ్చు.. ఈ 5 లక్షల ఎకరాలకి మొత్తం డోస్ 70 నుండి 75 కిలోలు యూరియా 500000×75కేజీలు=37,500 టన్నులు అవసరం అవుతుందన్నారు.
13వ వారానికి ముందు సాగు జరిగిన 29.5 లక్షల ఎకరాల పొలం లో లేట్ గా సాగు జరిగిన కొంత పొలానికి ఇంకా రెండు సార్లు, చిరు పొట్ట దశలో ఉన్న పొలానికి ఆకరి డోస్ అవసరం ఉన్నది. అంటే సరాసరిన సుమారు గా ఎకరానికి 40 కేజీల యూరియా 29,50,000×40=1,18,000 టన్నులు అవసరం అవుతుందన్నారు.
మొక్క జొన్న కు వరి కంటే రెట్టింపు పైగా రసాయనిక ఎరువులు వాడతారు. రాష్ట్రం లో ఈ నెల మూడోతేదీ నాటికి 3.5 లక్షల ఎకరాలలో మొక్క జొన్న సాగు జరిగింది. ఇప్పటికి వాడిన ఎరువు పోను ఇంకా సుమారుగా ఎకరానికి 60 కిలోల యూరియా అవసరం ఉండవచ్చు. అంటే, 3,50,000×60=21000 టన్నులు.. మొత్తంగా 37,500+1,18,000+21000=1,76,500 టన్నుల యూరియా సుమారుగా ఈ సెప్టెంబర్ ఆఖరి నాటికి (హార్టికల్చర్ కాకుండా) అవసరం అవుతుంది… చెరకు సాగు జరిగింది కేవలం 58 వేల ఎకరాలు మాత్రమేనని పేర్కొన్నారు.
ఒక సామాన్య రైతు ప్రతినిధిగా అలోచిస్తే అర్థం అవుతుందన్నారు. దీనిని బట్టి మన దగ్గర స్టాక్ ఎంత ఉన్నది పోను మిగిలిన యూరియా సెప్టెంబర్ 25 లోపు ఎట్టి పరిస్థితి లోను రాష్ట్రానికి చేర్చుకోక పోతే దిగుబడులపై ప్రభావం చూపి కవులు రైతులు, చిన్న, చిన్న రైతులు నష్టపోతారని నాగిరెడ్డి హెచ్చరించారు.