Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ప్రవేశపెట్టిన 18 పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్

-ప్రస్తుత ప్రభుత్వంలో కరెంట్ నిల్‍గా బిల్లు పుల్లు
-గుమ్మడి సంద్యారాణి

అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్.ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకకు 100 ఏళ్లుగా చెప్పుకోవచ్చు. గిరిజన గూడాల్లో చదువుకున్న వ్యక్తులే గిరిజనులు చదువు చెప్పేందుకు గురువులుగా తీర్చిదిద్దారు.ఐటీడీఏ లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఐటీడీఏలను తెరిచే పరిస్థితి లేదు. గిరిపుత్రిక కళ్యాణ పథకం, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చంద్రబాబు ప్రవేశపెట్టిన 18 పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్.

కాఫీ తోటలను చంద్రబాబు ప్రోత్సహిస్తే.. గిరిజనుల బతుకులను పణంగా పెట్టి జగన్ గంజాయి తోటలను ప్రోత్సహిస్తూ దేశంలో గంజాయి ఎగుమతుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. చంద్రన్న బీమా, బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి పేదలకు ద్రోహం చేసింది.గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ ను గత ప్రభుత్వం 90 శాతం ఖర్చు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 40 శాతమే ఖర్చు చేస్తూ.. గిరిజనులకు వెన్నుపోటు పొడుస్తోంది.గత ప్రభుత్వంలో గిరిజన గూడెల్లో కరెంట్ పుల్లుగా బిల్లు నిల్‍గా ఉండేది.. ప్రస్తుత ప్రభుత్వంలో కరెంట్ నిల్‍గా బిల్లు పుల్లుగా మారింది.

LEAVE A RESPONSE