Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు!

-పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోండి
-మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభలో యువనేత లోకేష్

మంగళగిరి: ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉంది.

గత అయిదేళ్లుగా ఒక్కో ఓటరు వద్దనుంచి జగన్ లక్షరూపాయలు దోచుకున్న జగన్… ఇప్పుడు ఖర్చుచేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే… తీసుకొని ఓటు మాత్రం నిరంతరం ప్రజలకోసం శ్రమిస్తున్న తమకు వేయాలని కోరారు. మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈరోజు 580మంది పనిచేస్తున్నారు.

అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE