Suryaa.co.in

National

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా?

ఢిల్లీ: ఐసీసీ ఛైర్మన్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనయుడు జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురు లేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది.

 

LEAVE A RESPONSE