– తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: స్వర్గీయ నేత , కేంద్ర మాజీ మంత్రి ఎస్ .జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పీ. వి నరసింహా రావు మార్గ్ లోని, జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ” జైపాల్ రెడ్డి నేటి తరానికి ఆదర్శనీయులని, ఆయన వివిధ హోదాల్లో పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత , సేవతత్వం కలిగిన నేత జైపాల్ రెడ్డి ని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని, రాష్ట్ర సాధన కోసం పోరాడరని , అప్పటి నేతలకు ఆయనే మార్గానిర్ధేశకులుగా నిలబడ్డారని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే పదానికి నిదర్శనం స్వర్గీయ నేత జైపాల్ రెడ్డి ని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.