– జగన్ రెడ్డి దొంగల జాబితాలో 2 వ అవినీతి తిమిoగళం జయరాం
– చిట్టా విప్పిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను ప్రకటించారు. కమీషన్ల శాఖా మంత్రిగా మారిన గుమ్మనూరి జయరాం మూడేళ్లలో రూ.. 735 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కార్మికులకు గంజి కూడా లేకుండా చేసి బెంజిలో తిరిగిన వ్యక్తి గుమ్మనూరు. ఈఎస్ ఐ వైద్య సిబ్బంది వయో పరిమితిని 60 నుండి 63కి పెంచుతామని 6 కోట్లు, ఈఎస్ఐ మందుల సప్లయర్స్ నుండి రూ.140 కోట్లు, రిఫరల్ ఆస్పత్రులకు బిల్లుల మంజూరులో కమిషన్లు రూ.28 కోట్లు, రిఫరల్ ఆస్పత్రుల ఎన్ ప్యాల్ మెంట్ రూ.5 కోట్లు కాజేశారు.
అలాగే కార్మిక శాఖలోని కార్మికుల ఇన్సూరెన్స్ లో అక్రమాలు చేసి 17 కోట్లు గుంజుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ లో పారిశ్రామికవేత్తలను బెదిరించి భూకబ్జాలకు పాల్పడ్డారు. పేదలకు వైద్యం అందించే ఈఎస్ఐలలో కౌంటర్లు పెట్టి జే ట్యాక్స్ వసూలు చేశారు. జయరాం మంత్రి పదవి అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నాడు. జయరాం కార్మికశాఖ మంత్రిగా ప్రజలకు ఉపాధి చూపలేదుగానీ తాగుడుకు బానిసలు చేశారు.
మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకర్గంలో పేకాట క్లబ్బులు, సారా దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. తన నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాయి. పేకాట శిబిరాలు, నాటుసారా కేంద్రాలను పెంచి పోషించాడు. నియోజకవర్గంలో ఏదైనా ఒక చిన్న రోడ్డు కాంట్రాక్టు నుంచి తన శాఖలో ఏ పని జరిగిన అందులో భారీ మొత్తంలో ఆయనకు కమిషన్ ఇవ్వాల్సిందే. మంత్రి నియోజకవర్గం అంటే సంక్షేమం, అభివృద్ది లో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి.
అవినీతి ముఖ్యమంత్రి జగన్ తన మంత్రలను పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మంత్రులు అవినీతిలో కూరుకుపోయారు. గుమ్మనూరు జయరాం తన శాఖలో అవినీతిలో కూరుకుపోయారు. ఆయనను కార్మిక మంత్రి అనే కంటే కమీషన్ ల మంత్రి అనడం సబబుగా ఉంటుంది. కార్మిక మంత్రిగా సంక్షేమాన్ని చూడాల్సిన మంత్రి తన శాఖను అడ్డ పెట్టుకొని తన నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డాడు. నిత్యం వేల కోట్లు సంపాదించాడు. ఈ బెంజి మంత్రి అన్నింటిలోనూ అక్రమాలు, అరాచకాలు, అవినీతితో దోపిడీ చేశారు.
కార్మకులకు ఉపాధి చూపాల్సింది పోయి పేకాట క్లబ్బులు, కల్తీ మద్దం, నాటుసారాలలో కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించారు. ఆయన నియోజకవర్గంలో మట్టి, ఇసుక మైనింగ్ పంచ భూతాలను కూడా దోచుకుంటూ వస్తున్నారు. అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. ప్రతి దాంట్లో కమిషన్ కావాలి. అవినీతిని పెంచి పోషిస్తున్నాడు. మంత్రి గుమ్మనూరు జయరాం కార్మికశాఖ మంత్రిగా కాకుండా కమీషన్ల మంత్రిగా పేరు పొందారు.
ఆయన నియోజకవర్గంలో ఏదైనా ఒక చిన్న రోడ్డు కాంట్రాక్టు నుంచి తన శాఖలో ఏ పని జరిగిన అందులో భారీ మొత్తంలో ఆయనకు కమిషన్ ఇవ్వాల్సిందే. జయరాం మంత్రి పదవి అడ్డుపెట్టుకొని గుర్తు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. అక్రమ సంపాదన కోసం అతను చేసిన అక్రమాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. జయరాం కార్మికశాఖ మంత్రిగా ప్రజలకు ఉపాధి చూపలేదు కానీ తన నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేసి తన అనుచరులకు, వైసీపీ నేతలకు స్వయం ఉపాధి కల్పించారు.
మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకర్గంలో పేకాట క్లబ్బులు, సారా దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మంత్రి నియోజకవర్గం అంటే సంక్షేమం, అభివృద్ది లో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. కానీ పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను, ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేయటం సిగ్గుచేటు. వైసీపీ మంత్రులు తమ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజల జీవితాలను చిన్నాబిన్నం చేస్తున్నారు. వీటన్నింటిని బయటికి లాగుతాం. చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం.