– కేసీఆర్ కుటుంబం, మాఫియా తెలంగాణను దోచుకుంది
– రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు-?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో, బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ , బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి , వారి అనుచరులు, పెద్దపల్లి, రామగుండంకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు
పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బులపై ఆధారపడింది. రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం లేదు. నెరవేర్చిన హామీలు ఏంటనేవి ప్రజలకు వివరించి ఎన్నికలకు రావాలి.
ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ, రుణమాఫీ, దళిత బంధు, గిరిజన బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను నెరవేర్చకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మహిళా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు. ఆరోగ్య శ్రీ అటకెక్కించారు. విద్య, వైద్య రంగానికి బడ్జెట్ లో నిధులను తగ్గించారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది.
రాష్ట్రంలో యువత, ప్రజలు నిశ్శబ్ధ వాతావరణంలో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు. తమ నిర్లక్ష్యం, అసమర్థతతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పేపర్ లీకేజీలకు కారణమై యువత, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్.
రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు..? కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపిన పాపం కాంగ్రస్ పార్టీది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం కారణంగా 1200 మంది విద్యార్థులు బలిదానమయ్యారు.తెలంగాణ వెనుకబాటుకు, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం, సాగునీటి వాటా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అవినీతిమయమే. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలే. తెలంగాణలో కుటుంబ, అవినీతి పార్టీల పీడ వదలాలి. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మాఫియా తెలంగాణను దోచుకుంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, ఓడించాలని తెలంగాణ సమాజం భావిస్తున్నది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నీతివంతమైన పాలనను అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసేదే చెప్తారు. చెప్పిందే చేస్తారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. వెన్నుపోటు పొడిచింది.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు గత 4 నెలల్లోనే పన్నుల పేరుతో వేలకోట్ల రూపాయలు ప్రజల నుంచి దండుకుంది. వందల కోట్ల రూపాయలను తెలంగాణకు పంపించేందుకు ట్యాక్స్ లు, వాటాల పేరుతో కర్ణాటక ప్రజల నుంచి వసూలు చేస్తోంది. దేశం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తాం. మద్దతు కూడగట్టి ప్రజల ఆశీస్సులతో బిజెపి జెండా ఎగురవేస్తాం.
సకలజనుల తెలంగాణను సాధిస్తాం: వివేక్ వెంకటస్వామి
పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లో మంచిపేరు సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదమవుతుంది.
జడ్పీటీసీ కందుల సంధ్యారాణి :భారతీయ జనతా పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణకు పట్టిన గ్రహణం వీడాలంటే, సుపరిపాలన అందాలంటే బిజెపి అధికారంలోకి రావాలి.ప్రజలు నిశ్శబ్ధ వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.అంబేద్కర్ గారి స్ఫూర్తి, పూలే గారి ఆశయాల సాధన దిశగా ముందుకెళ్తాను. భారతీయ జనతా పార్టీతోనే అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మహిళలంతా మద్దతు తెలపాలని కోరుతున్నా.