Suryaa.co.in

Telangana

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా గురువారం కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే తో కలిసి,రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను గౌరవప్రదంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, సహాయ మంత్రి సతీశ్ దూబేలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE