Suryaa.co.in

Telangana

తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొంది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు.

ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ లికేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. పేపర్ లికేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తొంది. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొంది.

మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విద్యార్థులంతా టెన్షన్ కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి. 10వ తరగతి తెలుగు పేపర్ లికేజీ పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి.

LEAVE A RESPONSE