Suryaa.co.in

Andhra Pradesh Telangana

కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మేఘారెడ్డిని గెలిపిద్దాం

– తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు రాములు

నపర్తి నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తూడి మేఘారెడ్డికి సపోర్ట్ చేస్తూ ఆయన గెలుపుకు కృషి చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు సూచించారు.

వనపర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి తనకు సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థించారు.అందుకు సానుకూలంగా స్పందించిన వారు తెలుగుదేశం పార్టీ తరఫున మేఘ రెడ్డికి సపోర్ట్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఇందుకు స్పందించిన మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ ఎలాంటి తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తూ తన గుండెల్లో పెట్టుకుంటానని వారికి హామీనిచ్చారు. ఈ సందర్భంగా బి రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు చేసింది ఏమీ లేదని రైతులకు సబ్సిడీలు లేకుండా చేసిందని రైతుబంధు పేర వందల ఎకరాలు భూములు కలిగిన రైతులకు లబ్ధి చేకూర్చిందని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందని ఇలాంటి BRS పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మేఘారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కృషి చేయాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటయ్య యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెల్టూర్ శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గౌడ సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షులు రామన్గౌడ్ పెద్దమందడి మండల ఉపాధ్యక్షులు హుస్సేన్, ఖిల్లా గణపురం మండల తెలుగు యువత అధ్యక్షులు శ్రీనివాసులు వనపర్తి 19 వ వార్డు అధ్యక్షులు రాములు 21 వ వార్డు అధ్యక్షులు గంధం రాజు, అప్పయ్యపల్లి సింగిల్ విండో డైరెక్టర్ బాలయ్య ఉపసర్పంచ్ యాదగిరి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిన్నయ్య, మాజీ కౌన్సిలర్ ఆవుల శ్రీనివాసులు పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు హోటల్ బలరాం యాదవ్, వాటర్షెడ్ చైర్మన్ శ్రీనివాసులు జి బాలయ్య జంగన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE