Suryaa.co.in

Telangana

మందుబాబుల జేబుకు షాక్?

-మళ్లీ పెరగనున్న లిక్కర్ ధరలు
-ఖజానాకు మద్యం ధరల కిక్కు
-తెలంగాణ సర్కారు కసరత్తు?

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. ఎన్నికల కారణంగా పెంచలేదు. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఖజానాను మద్యం ధరల కిక్కుతో నింపాలన్నది తెలంగాణ సర్కారు యోచనలా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE