Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రుషికొండ కి గుండు కొడితే ఎమ్మెల్యే ఆళ్ల ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

సహజ వనరుల దోపిడీలో జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. జగన్ రుషికొండకి గుండు కొడితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారు. సిఎం ఇంటికి కూత వేటు దూరంలో యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుంది ఆళ్ల మైనింగ్ మాఫియా. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండ పై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టిడిపి నాయకులని, కార్యకర్తల్ని అభినందిస్తున్నాను.

LEAVE A RESPONSE