Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి నాయకుల అధికార మదం పరాకాష్టకి చేరింది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసిపి నాయకుల అధికార మదం పరాకాష్టకి చేరింది. స్వయంగా మంత్రులే దుర్బాషలాడుతూ పోలీసులపై దాడులకి పాల్పడటం అరాచక పాలనకు నిదర్శనం. మొన్నే మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఒక పోలీస్ అధికారి చొక్కా ప‌ట్టుకుని“త‌మాషాలు చేస్తున్నావా! చొక్కా ప‌ట్టుకు లాగేస్తా నా కొడ‌కా” అంటూ అస‌భ్య‌క‌ర‌మైన భాష‌తో దాడి చేశారు. నేడు మంత్రి పేర్ని నాని “ఎవడ్రా నా కార్ తియ్యమన్నది” అంటూ

పోలీసులపై చిందులేసారు. ఉన్నతాధికారులను సైతం అవమానించేలా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులపై వైసిపి నేతల వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే ఈ దుస్థితి ఉంటే, ఇక ఈ రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి? జగన్ స్వామ్యం అనుకొని రెచ్చిపోతున్న వైకాపన్లకు ప్రజాస్వామ్యంతో బుద్దిచెప్పాలి.ఈ సందర్భంగా లోకేష్.. మంత్రి పేర్ని నాని వీడియోను ట్యాగ్ చేశారు.

LEAVE A RESPONSE