-కమీషన్లకు కక్కుర్తికి పోలవరాన్ని బలి చేస్తున్న జగన్ రెడ్డి
-రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వు టెండరింగ్
– రేపల్లె నియోజకవర్గం శాసనసభ సభ్యులు అనగాని సత్యప్రసాద్
వడ్డేంచేవాడు మన వాడైనప్పుడు ఏ బంతిలో కూర్చున్నా పర్వాలేదనే సామెత జగన్ రెడ్డి, మెఘా కంపెనీలకే సరిపోతుంది. 4 ఏళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మెఘా కంపెనీకే తిరిగి పోలవరంలో డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతం? రివర్స్ టెండరింగ్ పేరుతో మెఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి చేతగానితనంతో, నిర్లక్ష్యవైఖరితో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచి టెండర్ నిబంధనలకు ఉల్లంఘించి రూ.1615.75 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ కు దోచిపెడుతున్నారు.
రూ.100 కోట్లు దాటిన ఏ కాంట్రాక్ట్ కైనా జుడిష్యియల్ ఎంక్వైరీ వేసిన తరువాతే ఆ పనులు చేపడతామని జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులకు, ఎన్ని జుడ్యిష్యియల్ ఎంక్వైరీ వేశారో చెప్పు దమ్ము జనగ్ రెడ్డికి ఉందా? రికార్డు స్థాయిలో 71 శాతం పనులు, 24 గంటల్లో, 32,350 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నవయుగ కాంట్రాక్ట్ ను కక్షపూరితంగా తప్పించి మేఘా సంస్థకు పనులు అప్పగించి పోలవరాన్ని అటకెక్కించారు.
2019లో పోలవరం హెడ్ వర్క్స్ పనులను రూ.1,548.13 కోట్లకు మేఘా దక్కించుకొని సాధించిన ప్రగతి శూన్యం. ఇప్పుడు అదే సంస్థపై చర్యలు తీసుకోకుండా రూ.1,615.75 కోట్ల పనులు ఎలా అప్పగిస్తారు? మొత్తం మీద రూ.4,623 కోట్ల పనులు మెఘాకు అప్పగించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రాజెక్టు పూర్తి చేయడం మీద ధ్వాస పెట్టకుండా పోలవరాన్ని అడ్డుపెట్టుకొని ముడుపులు దండుకొనే పనిలో వైసీపీ నాయకులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల బకాయిలు పెడుతున్న జగన్ రెడ్డి మెఘా వంటి సంస్థలకు మాత్రం ఆగమేఘాల మీద బిల్లులు ఎలా చెల్లిస్తుంది?