Suryaa.co.in

Telangana

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీ-టీం గా ఎంఐఎం

– కాంగ్రెస్ పార్టీ కి ఏటీఎం గా కర్ణాటక
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం

హైదరాబాద్:తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పని చేస్తున్నాం.డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కుటుంబం, అవినీతి గురించి బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ లు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ స్వరాష్ట్రం కోసం బిజెపి పూర్తి మద్దతు తెలపడంతో పాటు రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది.

ఇక్కడ ప్రజల అభ్యున్నతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి లబ్ధి చేకూరుతోంది. బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రిస్తేదార్ పార్టీ.కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడే పార్టీ. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీ-టీం గా పని చేస్తుంది. యూపీఏ బీఆర్ఎస్ ఎక్స్ట్రా ప్లేయర్ గా పని చేస్తోంది.ఈ పార్టీ లు అన్నీ అవినీతి చేయడానికే పనిచేస్తాయి. కర్ణాటక లో భారీ గా డబ్బు పోగేసుకుంటున్నారు. ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ నేత వద్దే దొరికింది.తరలిస్తున్న డబ్బు దొరికింది కొంతమాత్రమే.. వేల కోట్ల రూపాయల లింక్ దొరికింది.

కర్ణాటక నుంచి ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల కు డబ్బు పంపుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కి ఏటీఎం గా మారింది. ఏజెన్సీ ని పెట్టుకుని డబ్బు పoచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్. తమిళనాడు సర్కారు సహకారంతో తెలంగాణ కు డబ్బు చేరుతోంది. కర్ణాటక నుంచి తమిళనాడు ద్వారా తెలంగాణకు డబ్బు చేరుతోంది. భారతీయ జనతా పార్టీ ఆ పనిచేయడం లేదు… కార్యకర్తలు కష్టపడి పని చేసి అధికారం లోకి తెస్తారు. కాంగ్రెస్ పార్టీ ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు పని చేస్తున్నారు.

కెసిఆర్ పదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడి దోచుకున్నారు.ప్రజల సొత్తు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో మభ్య పెట్టేందుకు వ్యతిరేకంగా వినియోగించే పార్టీ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.రానున్న ఎన్నికల్లో ప్రజలు చైతన్యంగా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానమైన అమరవీరుల ఆశయాలు గుర్తు చేసుకుని ఓటేయాలి. ఎమ్మెల్సీ కవిత అవినీతిపై విచారణ జరుగుతోంది. విచారణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదు. అవినీతికి పాల్పడిన కవితను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

LEAVE A RESPONSE