Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి పార్థసారథి, ప్రశాంతి తప్పు చేశారా లేదా.. చెప్పాలి

– అప్పుడు వాళ్లూ టీటీడీలో బోర్డు సభ్యులే కదా?
– నెయ్యిలో తాము తప్పు చేశామని వారిని చెప్పమనండి
– లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే మోదీ, సీజేఐలు, చంద్రబాబు కంప్లైంట్ ఇవ్వాలి కదా?
– బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు
– అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు?
తప్పుచేసినవారు ప్రాయశ్చిత్తం చేస్తారు
– మాజీ మంత్రి ఆర్కే రోజా

విజ‌య‌వాడ‌: టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ. సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈఓ నియామకం మాత్రమే సీఎం చూస్తారు. మిగిలిన విషయాల్లో సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు. జగన్ అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. ఇద్దరి మాటల్లో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు. ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు.

జూలై 23 న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కి పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం, సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావు పై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు.

మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి, బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావా ? ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు. తప్పు చేశారా లేదా? వాళ్లైనా చెప్పాలి!

జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా? ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు. అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు?

చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయారు.

ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు.

ప్రాయశ్చితం దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? తప్పు చేసినవారు చేస్తారు. అంటే ప్రభుత్వం లో ఉన్నాము. టిడిపి పాపంలో భాగం ఉంది కనుక, దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నారు.

LEAVE A RESPONSE