Suryaa.co.in

Andhra Pradesh

అసలు దోషులు వైసీపీ వారేనని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలతో అర్థమైపోయింది

– అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

వంగవీటి రాధా విషయంలో వెల్లంపల్లి వ్యాఖ్యలతో రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది వైసీపీ ప్రభుత్వమేనని అర్థమైంది.రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది ఎవరనేది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిన్నటి వరకు త్వరలోనే రాధా హత్యకు రెక్కీ నిర్వహించినవారిని బయట పెడతామని ప్రకటించిన పోలీసులు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మరుగున పరుస్తున్నారో మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలతో ప్రజలకు అర్థమైపోయిందని తెలియజేస్తున్నాం.

వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిన ప్రతిసారి ప్రతిపక్షంగా టీడీపీ ప్రజల ముందు వైసీపీని దోషిగా నిలబెడుతూనే ఉంది.పోలీసులు, ప్రభుత్వం తమ తమ విధులను నిర్వహించకుండా బాధితుల మీద మీ దగ్గర ఆధారాలుంటే మాకు చెప్పండి అని తప్పించుకొనేవారు రాధా విషయంలో రాజకీయాలు చేయాలనుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసులు.. రాధా తెలుగుదేశం పార్టీ వాడని, పార్టీ నుండి బయటికి రాడని అర్థమవడంతోటి వెల్లంపల్లి పాత పాటనే అందుకున్నాడు.దీనంతటికి డైరెక్షన్ జగనేనని స్పష్టంగా అర్థమవుతోంది.

రాజకీయ ప్రయోజనాల కోసమే రాధాపై విషపు ప్రమేను ప్రదర్శిస్తున్న మిత్రుల ఆటలు ప్రజలకు అర్థమయ్యాయి.వంగవీటి రాధాను రాజకీయాల్లో ఎవరూ మరచిపోలేదని.. రంగాగారు ప్రజలకు గుర్తున్నంత కాలం రాధాను ఎవరూ మరచిపోరని వెల్లంపల్లి గుర్తుంచుకోవాలి.మంత్రిని అని చెప్పుకునే వెల్లంపల్లి ప్రజలకెవరికీ తెలియదని.. కేవలం విజయవాడలో కొబ్బరి చిప్పల దొంగగా మాత్రమే వెల్లంపల్లి తెలుసునని వెల్లంపల్లి గుర్తు పెట్టుకోవాలి.

జగన్ డైరెక్షన్ లో కాపు ఓట్ల కోసం వేసిన స్కెచ్ లో రాధా పడలేదని.. రాధాపై వెల్లంపల్లి దిగజారుడు మాటలు మాట్లాడటం ఆపేయాలని తెలియజేస్తున్నాం.కాపులందరూ వైసీపీ ప్రభుత్వానికి దూరమవుతున్నారని గ్రహించిన జగన్ రెడ్డి రాధాకి స్నేహితులైన మంత్రులతోటి రాధాకు మంత్రం వేయాలని చూశారని.. ఫలించకపోయేసరికి వెల్లంపల్లితో దిగజారుడు మాటలు మాట్లాడిస్తున్నాడని అర్థమైంది.వంగవీటి రంగా ప్రజల మనిషి. ఆ విషయం తన తనయుడికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రంగా హత్య ఎవరు చేయించారో విజయవాడ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. దానిని టీడీపీ మీదకు నెట్టాలని చూసినవారిపై ప్రజలు అసహ్హించుకుంటున్నారు.

ఇది వైసీపీ నాయకులు, వెల్లంపల్లి గురెతరగాలని హితవు పలుకుతున్నాం. రాధా హత్య రెక్కీ విషయంలో పోలీసులతో ఈ ప్రభుత్వం ఎలాంటి కుట్ర చేయాలనుకుంటుందో వెల్లంపల్లి మాటల ద్వారా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.చంద్రబాబు ఇంటిపై టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు వైసీపీవారు మంత్రులు ఎలాంటి మాటలు మాట్లాడారో రాధా హత్యకై రాధా ఇంటికి రెక్కీ నిర్వహించినవారిపై కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. రాధా ఇల్లు మెయిర్ రోడ్డులో ఉందని, రెక్కీ నిర్వహించినవారు కేవలం కారులో అటూ ఇటూ తిరిగినంత మాత్రాన అది రెక్కీ కాదని, అలా అనుకుంటే పొరపాటు అవుతుందని వెల్లంపల్లి మాట్లాడటంతో వైసీపీయే రెక్కీ నిర్వహించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.ఇప్పటికైనా వైసీపీవారు రాధాపై రాజకీయాలు చేయటం మాని నిజమైన దోషులను రెక్కీ నిర్వహించడానికి ప్లాన్ చేసినవారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE