Suryaa.co.in

Andhra Pradesh

చెరువుల్లో జలకళ

– ఎమ్మెల్యేకు చెరువు ఆయకట్టు పల్లె ప్రజల నీరాజనాలు
– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

మైదుకూరు: పురపాలక పరిధిలోని ఎల్లంపల్లి.. శెట్టి వారిపల్లె, చిన్నయ్య గారి పల్లె తదితర గ్రామాల ప్రజల జీవనాధారం ఆ రెండు చెరువులే. ఆ రెండు చెరువులకు కృష్ణమ్మ కరుణ లేకుండా పోయింది.

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు చెరువు కింది రైతాంగానికి, ప్రజలకు ఎలాగైనా కృష్ణమ్మ ను మీ చెరువుల వద్దకు రప్పిస్తా. మీ కళ్ళల్లో ఆనందం తెప్పిస్తా అన్న మాటలు 100 రోజుల కాలంలోనే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిజం చేసి.. ఆ రెండు చెరువులను కృష్ణమ్మ జలాలతో నింపారు.

శెట్టి వారి పల్లె చెరువు నిండిపోవడం.. అలుగు ద్వారా కృష్ణమ్మ ప్రవహించి.. శ్రీ తిరుమలనాధుని పాదాల చెంతన ఉన్న చెరువును ముద్దాడింది. తన అందాలతో ఆ పల్లె జనాలకు ఆనంద బాష్పాలు రప్పించింది. ఇంకేముంది.. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తమ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఆ ప్రాంత ప్రజల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో భాగంగా మంగళవారం మైదుకూరు పురపాలక సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను ఎల్లంపల్లి, శెట్టి వారి పల్లి, చిన్నయ్య గారి పల్లె గ్రామ ప్రజలు తమ ఆనందాల మధ్య ఘనంగా సత్కరించారు.. అభినందనలు తెలియజేశారు. చెరువులకు కృష్ణన్ రప్పిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాటను స్మరించుకున్న ఎమ్మెల్యే ఆనందంతో పులకించాడు. ఈ ప్రాంత ప్రజల ఆనందాన్ని చూసి మురిసిపోయాడు.

LEAVE A RESPONSE