Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పర్యటన విజయవంతం కావడం జగన్ రెడ్డి జీర్ణించుకోలేకనే కూల్చివేతలు

– టీడీపీ ఎంపీ కనకమేడల

ఆదివారం అర్థరాత్రి టీడీపీ బీసీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటిని జగన్ రెడ్డి కూల్చడం చట్టవ్యతిరేకం.అయ్యన్నపాత్రడు ఏ భూమినీ కబ్జా చేయలేదు. ప్రభుత్వం చెప్పేవన్నీ కట్టుకథలే. అయ్యన్న ఇంటిపై జగన్ రెడ్డి చేసిన అప్రజాస్వామిక, అనైతిక దాడికి కోర్టులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

అయ్యన్నపాత్రడు ఇంటిని కూల్చిన ఏ అధికారీ కోర్టు కనుసన్నల్లో నుండి తప్పించుకోలేరు…తస్మాత్ జాగ్రత్త.జగన్ రెడ్డి విధ్వంసాలను ప్రజాకోర్టులో ప్రజలు ఇప్పటికే చీదరించుకుంటున్నారు.చంద్రబాబు పర్యటన విజయవంతం కావడం ఓర్చుకోలేని జగన్, అయ్యన్నపాత్రుడిపై తప్పుడు ఆరోపణలతో ఇంటిని కూలదోయడం అన్యాయం.

జగన్ రెడ్డి కుటుంబ చరిత్ర మొత్తం కబ్జాకోరు చరిత్రే.వైసిపి నేతల్లో ఏ ఒక్కరికీ కబ్జాల గురించి నోరెత్తే అర్హత లేదు.ఇడుపలపాయ ఎస్టేట్ లో, పెనమలూరు ఎస్టేట్ లో వందలాది ఎకరాల అసైన్డ్ భూములను జగన్ రెడ్డి అనుభవిస్తున్నారు. వాన్ పిక్ లో రాష్ట్రవాప్తంగా జగన్ రెడ్డి బినామీలు వందలాది ఎకరాల భూమిని కబ్జా చేశారు. జగన్ రెడ్డి బినామీల బాగోతాన్ని రానున్న ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

LEAVE A RESPONSE