– నల్లమల్ల సాగర్ గా పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహం
– దానికి సహకరిస్తున్న రేవంత్
– ఉద్యోగస్థుల విషయంలోనూ ఆంధ్ర వాళ్ళ పెత్తనం సరికాదు
– పిపిటి లో అవకాశమడిగితే భయమెందుకు?
– అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) నిరాకరణ, ఆంధ్ర నల్లమల సాగర్ నీటిదోపిడిపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అవకాశమడిగితే భయమెందుకు? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు పెట్టండి.. మాకూ అవకాశమివ్వండి. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడుతరు. ఆనాడు మీరు అడ్డుకున్నట్టు మేము అడ్డుకోము. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయట పడుతుంది. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్ కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు.
మీ స్క్రీన్ పైనే మీ కాంగ్రెస్ బాగోతం బయట పెడతాం. వాళ్ళ అసలు రంగు బయటపడుతుందనే బీఆర్ఎస్ అడిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి మొండిచేయి చూపుతున్నారు. అవకాశం ఇస్తే నీటి వాటా పై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం. పీపీటీకి అవాకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరుని ప్రజల్లో ఎండగడతాం.
శాసనసభలో అందరికి సమానమైన అవకాశాలు ఇవ్వాలి. రాష్ట్రంలో మళ్లీ పాత పరిస్థితులే. అప్పుడు అరవై ఏండ్లు. ఇప్పుడు రెండేళ్లు ఏంచేసిండ్రో చెప్పాలి. పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్దతిలో కాంగ్రేస్ పాలన. నల్లమల్ల సాగర్ పేరుమీద కొత్త నాటకం. పక్క రాష్ట్ర నీటి దోపిడీకి సహకరిస్తున్న రేవంత్.. వారు సూచించిన సలహాదారులను పెట్టి తెలంగాణకు అన్యాయం.
నీటి వాటా కోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన హక్కులను ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్నారు. ఆయన తీరుతో కృష్ణా , గోదావరిలో నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నల్లమల్ల సాగర్, బనక చర్ల రెండూ ఒక్కటే. నల్లమల్ల సాగర్ గా పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహం. దానికి సహకరిస్తున్న రేవంత్.
ఢిల్లీకి పంపిన కమిటీలో చంద్రబాబు చూపిన అధికారిని పెట్టి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్. ఉద్యోగస్థుల విషయంలోనూ ఆంధ్ర వాళ్ళ పెత్తనం సరికాదు.తెలంగాణ ప్రయోజనాలకోసం కెసిఆర్ పోరాటం అంతా ఇంత కాదు. ఈ విషయంలో మీ తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదు.