నక్సలిజం మొదట పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో మొదలైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో ఇది శ్రీకాకుళం జిల్లాలో 1969లో మాత్రమే దీని యొక్క కార్యాచరణ ప్రారంభమైంది. ఇది ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్యమంగా ఉన్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో దాని ప్రభావం తగ్గింది.
1969లో శ్రీకాకుళం జిల్లాలో నక్సలిజం ఒక ఉద్యమంగా మొదలైంది
కొనసాగింపు: కొండపల్లి సీతారామయ్య వంటి నాయకుల ఆధ్వర్యంలో, ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రజా యుద్ధం (People’s War) వంటి రూపాలు తీసుకుంది.
ప్రభావం: ఒకప్పుడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసినా, ఇటీవల కాలంలో దాని ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైట్ నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు, మాధవరెడ్డి వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా.. కేవలం వారి ఉనికిని నిలబెట్టుకోవడానికి చంపేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో క్లైమోర్ దాడి చేసి హతమార్చాలని చూశారు,విఫలమయ్యారు. పోలీసు భద్రతా బలగాలను,అధికారులను ఎంత మందిని చంపారో లెక్కలేదు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం క్రమేపి తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను క్లైమాక్స్ కు తీసుకు వచ్చాక… చివరి ఘట్టం ఏపీలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
లీడర్, క్యాడర్ ఎవరూ లేరు
మావోయిస్టుల భావజాలం గురించి పక్కన పెడితే ప్రస్తుత కాలంలో వారి పోరాట విధానమే అసహజం. ఎక్కడ ఉన్నా మనిషిని ఇట్టే కనిపెట్టగలిగే టెక్నాలజీ వచ్చింది. వీరు అడవుల్లో కి వెళ్లినప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో.. ఆ నక్సల్స్ మైదాన ప్రాంతాల్లో యథేచ్చగా తిరిగినా గుర్తు పట్టేవారు ఉండరు. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం బహిరంగం అయిపోయింది. అంతకు మించి భావజాలం బలహీనపడిపోయింది. అంతర్గత సమస్యలతో చీలికలు పేలికలు అయి.. పోలీసులకు సమాచారం ఇచ్చేవారు ఎక్కువయ్యారు. ప్రభుత్వం కూడా నక్సల్స్ సమస్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే లొంగిపోయిన వాళ్లు లొంగిపోగా..మిగిలిన వాళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు లీడర్, క్యాడర్ ఎవరూ లేరు.
హిడ్మా ఊపిరి పోస్తాడనుకున్న సానుభూతిపరులు..
మావోయిస్టులకు .. బహిరంగంగా కొంత మంది మద్దతు పలుకుతూంటారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చెప్పినట్లుగా .. వీరు మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో దందాలు చేసుకుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతారు. కానీ యువతను రెచ్చగొడుతూంటారు. ఇలాంటి వారంతా హిడ్మా ఉన్నంత కాలం మావోయిస్టు పార్టీ ఎప్పటికైనా రైజ్ అవుతుందని చెబుతూంటారు. అయితే ఇప్పుడు ఆ హిడ్మా లేరు. మావోయిస్టు పార్టీకి ఇప్పుడు లీడర్ గా భావిస్తున్న దేవ్ జీ ఆచూకీ తెలియడంలేదు. పోలీసుల వద్దే ఉన్నారని. ఈ సానుభూతి పరులు అంటున్నారు. ఈ నక్సలిజం అనేది గతంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు, దోచుకునే వ్యాపారస్తుల దోపిడీకి,కబ్జాలకు,ఆర్ధిక నేరాలకు కొన్నేళ్ల పాటు అడ్డుకట్ట వేయగల్గిన మాట, వీరంతా ఎంతో క్రమశిక్షణతో భయంతో దాక్కుని తిరిగిన మాట అయితే వాస్తవం,యదార్థం.. ఇప్పుడు ఆ భయం రాజకీయ నేతలకు, దోపిడీదారులకు ఇక లేదు… యధేశ్చగా వీరి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం “ఆపరేషన్ కగార్” కల్పించేసింది. Enjoy లీడర్స్…
కేంద్ర ప్రభుత్వ గడువుకు ముందే ముగుస్తున్న నక్సలిజం…
వచ్చే ఏడాది మార్చి31 వరకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కానీ దళాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. చివిరికి దేవ్ జీ కూడా దొరికిపోయారని చెబుతున్నారు. చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలోనే వీరు ఉండలేక విజయవాడకు,ఏలూరు తదితర మైదాన ప్రాంతాలకు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారంటే.. వీరికి ఎక్కడా బతుకు లేదని అర్థం. మిగిలిపోయిన మావోయిస్టులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉంటారు. వారందర్నీ కూడా లొంగిపోయేలా చేయడమో.. లేకపోతే వేరే మార్గమో చూసి.. తెలుగు నేలపైనే ప్రారంభమైన నక్సలిజం తెలుగునేలపైనే అంతం అనే ప్రకటన చేసినా ఆశ్చర్యం ఉండదు.
నక్సలైట్లను చంపగలరు కానీ.. నక్సలిజాన్ని చంపలేరని కొంత మంది అంటూ ఊహల్లో ఉంటారు.. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే మూల సిద్ధాంతమే నక్సలిజం అయితే.. మన ప్రజాస్వామ్య లౌకిక దేశంలో నక్సలిజ విధానం కూడా ఇక అంతమయినట్లే…. బుల్లెట్టు తో రాజ్యాధికారం రాదు… బ్యాలెట్/evm తోనే రాజ్యాధికారం సాధ్యపడుతుంది ఈ భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య దేశంలో అనే లాజిక్ మిస్ అయ్యారు.. ఇన్నేళ్లు.. అందులో అయితే సందేహమేమీ ఉండదు. మానవ హక్కుల సంఘాల నాయకులార మీకో విన్నపం… పోలీసులవి, ప్రజాప్రతినిధులవి, ప్రజలవి కూడా ప్రాణాలే.. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే.. అది గుర్తెరిగి మీ మీ అనునూయలకు తెలపండి.. బుల్లెట్ వద్దు… బ్యాలెట్ ముద్దు అనే నినాదం ద్వారా మీకు చేతయితే మిగిలిన వారిని జనజీవన స్రవంతిలోకి చేరేలా చేయండి.
– సిరిపురపు శ్రీధర్శర్మ ప్రజా చైతన్య వేదిక


