Suryaa.co.in

Telangana

ఆటవిక పాలన చేస్తున్న నితీశ్ కుమార్- కేసీఆర్ ఆలోచనలు ఒక్కటే

– ఆనందమోహన్ వస్తుంటే కేసీఆర్ నోరుమెదపకపోవడం దుర్మార్గం
– ఆనంద మోహన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడానికి వీల్లేదు
– బీజేపీ శ్రేణులు అడ్డుని తీరుతాయి
– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

పాలమూరు బిడ్డ, బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి క్రిష్ణయ్య గారిని అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ ను నితీశ్ కుమార్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు. తెలంగాణలోని క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవడానికి ఆనందమోహన్ వస్తుంటే కేసీఆర్ నోరుమెదపకపోవడం దుర్మార్గం.

బీహార్ లో ఆటవిక పాలన చేస్తున్న నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలు ఒక్కటేనని అర్ధమవుతోంది. నితీశ్ – కేసీఆర్ హత్యా రాజకీయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలి. రాళ్లతో కొట్టించి తెలంగాణ బిడ్డను చంపించిన నరరూప రాక్షసుడు తెలంగాణకు వస్తున్నారంటేనే… ప్రజల రక్తం మరిగిపోతోంది. ఆనంద మోహన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ వచ్చేందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీజేపీ శ్రేణులు అడ్డుని తీరుతాయి.

LEAVE A RESPONSE