Suryaa.co.in

Andhra Pradesh

అందరూ సైకో అబ్బాయిలా ఉండరు..ప్రసన్న కుమార్ రెడ్డి!

– జంతువు దాడిలో చిన్నారి లక్షిత మృతి విషాదకరం‌
– నేరగాళ్ల పాలనలో క్రూర జంతువుల నుంచి జనానికి రక్షణ కరవైంది
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

అలిపిరి మార్గంలో జంతువు దాడిలో చిన్నారి లక్షిత మృతి విషాదకరం‌. కళ్ల ముందే కన్నబిడ్డ మరణం కన్నవాళ్లకి తీరని శోకము మిగిల్చింది. తిరుమలలో జంతువుల దాడులు పెరిగినా, సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో లక్షిత బలైంది. నేరగాళ్ల పాలనలో క్రూర జంతువుల నుంచి జనానికి రక్షణ కరవైంది. భక్తుల భద్రతకి భరోసా ఇచ్చేలా తక్షణమే సర్కారు చర్యలు తీసుకోవాలి‌. లక్షిత తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చిన్నారి తల్లిదండ్రులపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేయడం, వైకాపా పైశాచిక ప్రవృత్తిని బయట పెడుతోంది. మీ అధినేత జగన్ ఓట్లు- సీట్లు కోసం బాబాయ్ అని కూడా కనికరించకుండా చంపేసాడని, అందరూ సైకో అబ్బాయిలా ఉండరు. దుర్మార్గపు ఆరోపణలు మాని, బాలిక కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

LEAVE A RESPONSE