-కేసీఆర్, మోడీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది
పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
-ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
-వికాస్ రాజ్ కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు..
-దీంతో బీజేపీ బీఆరెస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది
రైతులకు 5వేలు నష్టం జరుగుతోంది
-కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి… కాంగ్రెస్ వచ్చాక మేం ఇవ్వాల్సింది ఇస్తాం
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
కేసీఆర్, మోడీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ప్రధానంగా నేను మూడు అంశాలను ప్రస్తావిస్తున్నా.రైతు బంధు, వివేక్, పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం… కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడం.2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు చెప్పారు.
2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెస్ కు సహకరించింది. దీంతో బీజేపీ బీఆరెస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది.
ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో రైతులకు 5వేలు నష్టం జరుగుతోంది.కౌలు రైతులు, రైతు కూలీలుగా పూర్తిగా నష్టపోతున్నారు. బీఆరెస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావద్దు. రైతులు ఆందోళన చెందొద్దు.. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి… కాంగ్రెస్ వచ్చాక మేం ఇవ్వాల్సింది ఇస్తాం. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు.కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు.బీజేపీ, బీఆరెస్ కలిసి అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు.బంధుత్వం కూడా బీఆరెస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది.
ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆరెస్ వారిని టార్గెట్ చేశారు. ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.వికాస్ రాజ్ కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు.. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలి.
బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదు.కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు.డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు.. నగదు బదిలీ పథకం మొదలైంది. బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయండి.మాకు ఈ ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ తో కాదు ఈడీ, ఐటీ తో.