– పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా కిషన్ రెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా.. పంచకట్టులో వచ్చిన కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అచ్చ తెలుగులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవలే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ గారు.. తొలుత ప్రధాని మోదీ అనంతరం కేంద్రమంత్రులతో ప్రమాణం చేయించారు.