Suryaa.co.in

Andhra Pradesh

నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా పార్ధసారధి

– నూజివీడు టీడీపీ అభ్యర్థి సారథి

కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని నియమించారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పార్థసారథికి ఆ పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయనకు యాదవులు ఎక్కువగా ఉన్న నూజివీడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నాయకత్వం తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలలో సారథి మంత్రి పదవులు నిర్వహించిన విషయం తెలిసిందే. పొత్తులో ఇంకా ఎవరికెన్ని సీట్లు ఖరారు కాని నేపథ్యంలో.. సారథిని అభ్యర్థిగా కాకుండా పార్టీ ఇన్చార్జిగా ప్రకటించినట్లు కనిపిస్తోంది.

కాగా ఇప్పటివరకూ నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ముద్రబోయిన వైసీపీలో చేరనున్నారు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత సారథి.. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రోత్సాహంతో, టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కొన్ని సమీకరణల వల్ల ఆయన చేరిక నిలిచిపోయింది.

LEAVE A RESPONSE