– మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు.. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేం ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా.. లేక అవివేకవంతుడా తెలియడం లేదు… మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్న.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించాలని పొన్నం కోరారు.
స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడడం దురదృష్టకరం.. ఆంధ్రప్రదేశ్ లో తుపాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేం ఆంధ్రప్రజలను తప్పు పట్టడం లేదు.. ఆది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం.. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం.. వెంటనే పవన్ కల్యాణ్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి.. భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని ఆయన అన్నారు.