Suryaa.co.in

Andhra Pradesh

అనుభవం ఉంటే అరెస్టు చేయకూడదా?

– స్కిల్ పేరుతో.. రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు
– హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి.
-ః రాష్ట్ర, విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనుభవం ఉంటే అరెస్ట్ చేయరా..?
-స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా?
– కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారు
– మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారు.
– ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ- ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది..? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడు.
– ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయి
-సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు
– వారంతా ఈ కుట్రలో పాత్రధారులు… సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు
– కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారు
– షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారు

హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి
– ఆ డబ్బులు అన్ని చంద్రబాబు కు, ఆ పార్టీ వారికి చేరాయి
– ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే… అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు
– అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే… చంద్రబాబు సిఐడిని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది
– ఐటి నోటీసులు ఇస్తే… ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారు
– ప్రభుత్వ ధనాన్ని దొచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది
– అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది
– చంద్రబాబు బంధువు, బీజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ళకు స్కాము.. కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం.
– పురంధేశ్వరి గారు ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలి.
– అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరు
– అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు… ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు.

ఓటుకు కోట్లు కేసులోనూ ఇదే అడ్డగోలు వాదన
-ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు
-ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబు కు మద్దతు తెలిపింది… ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి
-రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు
-సిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు
– ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్ స్కాముల్లో కూడా అవకతవకలు జరిగాయి… అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు
– పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసిపి కార్యకర్త కూడా లేరు
– రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే….. పోలీసులు అడ్డుకున్నారు.
– ఆరోజు టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది

LEAVE A RESPONSE